4 May, 2026 | 7:30 PM

కార్మిక చట్టాలను వినియోగించుకొవాలి: జడ్జి దుర్గం గణేశ్

04-05-2026 06:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలనువినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు.  మేడే వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా  జడ్జి గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర కార్మికులు తప్పనిసరిగా కార్మిక గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. ఈ గుర్తింపు కార్డు లతో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. పలువురు న్యాయవాదుల కార్మిక చట్టాల గురించి వివరించారు. అనంతరం సీనియర్ కార్మికున్ని జడ్జి గణేష్ శాలువతో సత్కరించారు.