31-05-2025 02:02:25 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ‘మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. ఇప్పటివరకు 2.10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. మిగతా లబ్ధి దారుల జాబితాను వచ్చే నెల 10లోపు ప్రకటిస్తాం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 42 వేల ఇళ్లు మంజూరు చేశాం. 24 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిం ది. వంద ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి’ అని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా తో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే 40 శాతం లబ్ధిదారులు జాబి తా ఇస్తారని, మిగతా 60 శాతం లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయని తేల్చిచెప్పారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్తారని, క్షేత్రస్థాయిలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలిస్తారని వెల్లడించారు.
ఐటీడీఏ పరిధిలో చెంచులకు 9,200 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్లోని 16 మురికివాడల్లో నాలుగు అంతస్తుల భవనాలు నిర్మిస్తామని, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇవే తరహా నిర్మాణాలు చేపడ తామని వివరించారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం అలా కాదని, ప్రతి ఎమ్మెల్యేకూ తగిన ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లకు వినియోగించే సామగ్రి, వస్తువులను కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ సభ్యుల పరిశీలిస్తారని, జిల్లాస్థాయి, మండ ల స్థాయిలో కమిటీలు వేయబోతున్నామని స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొ న్నారు. అలాగే అడిషనల్ కలెక్టర్లు కమిటీ సభ్యులుగా ఉంటారని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాం తంలో 1.13 లక్షలు, రూరల్లో 13 లక్షల ఇళ్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, వాటిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు.
కేసీఆర్ పక్కన దెయ్యాలెవరో కవిత చెప్పాలి..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేతకు రాసిన లేఖ టీ కప్పులో తుఫాన్ లాంటిదని మంత్రి పొంగులేటి కొట్టిపడేశారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో తప్పులు జరిగాయని, ఆ తప్పులన్నింటికీ బాధ్యులు శిక్ష అనుభవించక తప్పదని అభిప్రాయపడాడరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనుక దెయ్యాలు ఉన్నాయని పేర్కొన్న కవిత, ఆ దెయ్యాలెవరో చెప్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్కి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలతో బయపడిందని, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారని గుర్తుచేశారు.
భూబకాసురుల జాబితా బయటపెడతాం..
గత ప్రభుత్వంలో భూములు కాజేసిన భూ బకాసురుల జాబితాను త్వరలోనే బయటపెడతామని, వాళ్ల పనిపట్టే సమ యం దగ్గరికి వచ్చిందని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. భూభారతి చట్టం ద్వారా 100 శాతం సమస్యలు పరిష్కారం కాకున్నా, కనీసం 90 శాతం పరిష్కారమవుతాయ న్నారు. గత ప్రభుత్వంలో పార్టీ పెద్దలు ప్రభుత్వ ఆస్తులను సొంతం చేసుకునే ప్రయత్నం చేశారన్నారు.
మా హయాంలో కాళేశ్వరం కట్టి ఉంటే.. మేం జైలుకే..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం కనీస నిబంధనలను కూ డా పాటించలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. పాలకులు ఇసుకపై బరా జ్ కడితే.. అది ఎలా నిలుస్తుందని ఎద్దే వా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే బరాజ్ కూలింది కాబట్టి స రిపోయిందని, లేదంటే కాంగ్రెసోళ్లు కూ ల్చారని, బీఆర్ఎస్ నేతుల తమపై నింద లు వేసేవాళ్లని చెప్పుకొచ్చారు. తమ హయాంలో ప్రాజెక్ట్లు కూలితే, తమను అప్పుడే జైల్లో పెట్టాల్సి ఉందన్నారు.