calender_icon.png 8 June, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసూల్‌పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

06-06-2025 12:20:10 AM

అధికారులను ఆదేశించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): రసూల్‌పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో గురువారం కమిషనర్ సికింద్రాబాద్ జోన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బస్ స్టాప్లను పరిశీలించారు.

రైల్వే సరిహద్దు నుంచి 24 మీటర్ల వరకు భూమి అవసరం ఉందని అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు. బస్‌స్టా ప్‌నకు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి దాన్ని తరలించాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాస్ కమిషనర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ హెచ్‌సిటీ ద్వారా రసూల్‌ఫుర వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ నిర్మాణ స్థలాన్ని వెంటనే పరిశీలించి భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.