calender_icon.png 11 June, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం

06-06-2025 12:03:15 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, జూన్ 5 (విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి 2025 ఆర్‌ఓఆర్ చట్టం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలను రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు.

రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండలం జయ్యారం, కురవి మండలం నేరెడ, సూదనపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ గురువారం పరిశీలించారు.

హెల్ప్ డెస్క్ ద్వారా రైతుల నుండి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రైతులకు అవసరమైన దరఖాస్తు ఫారాలను అందించి వారి సమస్య పరిష్కారం కోసం సూచనలు ఇచ్చి సరైన విధంగా దరఖాస్తు చేసుకునే విధంగా సహకరించాలని కలెక్టర్ రెవిన్యూ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.