06-06-2025 12:03:56 AM
కామారెడ్డి, జూన్ 05,(విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా బిక్కునూరు ఎస్త్స్ర పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన జండ్రు రవి. కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన జండ్రు రవి అనే దళిత రైతుపై భిక్కనూర్ ఎస్త్స్ర భూమి విషయంలో వేదిస్తున్నాడని కామారెడ్డి జిల్లా ఎస్పీకి గురువారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
అనంతరం జాండ్రు రవి రజిత మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 979/3 రెండు ఎకరాల ఉందని, 2001 సంవత్సరంలో నంగి బాగాయ్య దగ్గర సర్వే నెంబర్ 977 లో రెండు ఎకరాల భూమి సాగు చేసుకుని పంట పండించుకొని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు, ఈ మధ్యకాలంలో రామాయంపేట గ్రామానికి చెందిన మురికి సిద్ధ రాములు మేము పంట పండించుకుంటున్న భూమి మాదిని వస్తున్నాడని,
ఇట్టి విషయం పైన గత నెల 7 తేదీన బిక్నూర్ ఎస్త్స్రకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, అదే రోజు నా ముందే నా భర్తను ఎస్ఐ ఆంజనేయులు కొట్టడం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇట్టి విషయం పైన గురువారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కి ఫిర్యాదు చేయడం జరిగిందని దళితులను చిన్నచూపు చూస్తున్న ఎస్ఐ పైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు.
అంతేకాకుండా రామాయంపేట గ్రామానికి చెందిన సిద్ధిరాములు అతని కొడుకు ఈరోజు నన్ను ఇష్టమొచ్చి కొట్టడం జరిగిందని నా బండి తాళం ఫోన్ తీసుకొని కొట్టి వెళ్లిపోవడం జరిగిందని మురికి సిద్ధిరాములు పైన కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.