15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఇంట్లోనే భూమి రిజిస్ట్రేషన్

08-02-2026 12:45 AM

వృద్ధురాలి ఇంటికెళ్లి భూమి రిజిస్ట్రేషన్ చేసిన మెట్‌పల్లి తహసీల్దార్ 

మెట్‌పల్లి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఇంటికే వెళ్లి మెట్‌పల్లి తహసీల్దార్ నకుమల్ల నీత భూమి రిజిస్ట్రేషన్ చేశారు. వెంపేట్ గ్రామానికి చెందిన సుద్దాల అనసూయ (70) గత ఏడు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితం అయ్యారు.

ఆమె తన పేరుపై ఉన్న నాలుగు ఎకరాల పది గుంటల భూమిని తన ఇద్దరు కొడుకులకు రిజిస్ట్రేషన్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. కానీ అన సూయకు నడవడానికి కూడా వీలుకాపోవడంతో విషయం తహసీల్దార్‌కు ఆమె కుమారులు తెలిపారు. దీంతో తహసీల్దార్ శనివారం తన సిబ్బం దితో కలిసి వెంపేటలోని ఆమె ఇంటికి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ చేశారు. తహసీల్దార్ మనవతా దృక్పథంతో అర్జీదారుల ఇంటికే వెళ్లి రిజిస్ట్రేషన్ చేయ డంతో పలువురు అభినందనలు తెలిపారు.