calender_icon.png 12 June, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘యాక్స్-4’ మిషన్ ప్రయోగం రేపటికి వాయిదా

10-06-2025 12:00:00 AM

  1. ప్రతికూల వాతావరణమే కారణమని ‘ఎక్స్’ వేదికగా ఇస్రో వెల్లడి
  2. అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు విదేశీ వ్యోమగాముల ప్రయాణం
  3. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఫ్లోరిడా నుంచి స్పేస్‌ఎక్స్ నౌకలో నింగిలోకి

న్యూఢిల్లీ, జూన్ 9: అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘యాక్స్-4’ మిషన్ ప్రయోగం బుధవారానికి వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  (ఇస్రో) ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. అయితే ప్రయోగం మరుసటి రోజుకు వాయిదా పడినప్పటికీ ఆరంభ సమయంలో స్వల్ప మార్పులు చే సింది.

ఈ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం  5:30 గంటలకు ప్రారంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కె న్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స ంస్థకు చెందిన క్రూ డ్రాగన్ సీ-213 వ్యోమనౌకలో శుభాన్షు శుక్లా తన బృందంతో కలిసి ఐ ఎస్‌ఎస్‌కు పయనమవుతారు.

ఫాల్కన్-9 రా కెట్ ఈ వ్యోమనౌకను భూమి దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. అనంతరం ఈ వ్యోమనౌక గురువారం రాత్రి సుమారు 10 గంటలకు అ ంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధా నమయ్యే అవకాశముంది. ఈ మిషన్‌లో శు భాన్షు శుక్లా పైలట్‌గా వ్యవహరించనుండగా, అమెరికా వ్యోమగామి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్‌గా బా ధ్యతలు నిర్వర్తిస్తారు.

వీరితో పాటు పోలండ్‌కు చెందిన స్లావోష్ ఉజ్‌నైన్‌స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు కూడా ఉన్నారు. భారత్ నుంచి ఐఎస్‌ఎస్‌లోకి వెళ్తున్న తొలి భారత వ్యోమగామిగా, అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా నిలవనున్నారు. గతంలో భారత వ్యోమగామి రాకేశ్ శ ర్మ 1984లో అంతరిక్ష ప్రయాణం చేశారు. భారతీయులు ఈ యాత్రను ‘మిషన్ ఆకాశ గంగ’ అని పిలుస్తున్నారు.

రెండువారాల్లో 60 ప్రయోగాలు..

శుభాన్షు నేతృత్వంలోని బృందం రెండు వా రాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నే ఉంటుంది. ఈ సమయంలో దాదాపు 60 శాస్త్రీయ ప్రయోగాలను చేపట్టునున్నారు. వీ టిలో ఏడు ప్రయోగాలను భారతీయ పరిశోధకులు ఎంపిక చేశారు. మైక్రో ఆల్గేపై అ ధ్యయంతో పాటు, గురుత్వాకర్షణ స్థితిపై శుభాన్షు బృందం దృష్టి సారించనుంది.

ఎవరీ శుభాన్షు శుక్లా?

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించిన శుభాన్షు శుక్లా 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ వింగ్‌లో చేరారు. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-32 సహా పలు రకాల యుద్ధ విమానాలను నడిపి అపార అనుభవాన్ని గడించారు. 2024 నాటికి గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. 2019లో ఇస్రో నుంచి ఆయనకు పిలుపు వచ్చింది.

అనంతరం రష్యాలోని మాస్కోలో ఉన్న యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో వ్యోమగామిగా ప్రత్యేక శిక్షణ పొందారు. తాజా అంతరిక్ష యాత్ర ద్వారా స్పేస్‌ఫ్లుటై ఆపరేషన్స్, లాంచ్ ప్రోటోకాల్స్ వంటి అంశాల్లో శుక్లాకు అనుభవం లభించనుంది. ఇస్రో భవిష్యత్తులో చేపట్టున్న ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్’ మిషన్‌కు ఈ అనుభవాలు ఎంతగానో దోహదపడనున్నాయి.

ఇక మిషన్‌లో శుభాన్షు శుక్లాతో పాల్గొంటున్న ఇతర వ్యోమగాములు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. హంగేరీ వ్యోమగామి టిబోర్ కాపు మాట్లాడుతూ.. శుక్లాకు ఉన్న పరిజ్ఞానం, తెలివి చూస్తుంటే ఆయన వయసు 130 ఏళ్లు అనిపిస్తోందంటూ తెలిపారు.