calender_icon.png 13 June, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యే అసలు విలన్!

10-06-2025 12:00:00 AM

  1. వీడిన ఇండోర్ నవదంపతుల మిస్సింగ్ మిస్టరీ
  2. భార్యే సుపారీ ఇచ్చి భర్తను చంపించినట్టు వెల్లడించిన పోలీసులు
  3. తాను అమాయకురాలినంటున్న నిందితురాలు సోనమ్
  4. సోనమ్ కి‘లేడీ’ అంటున్న రఘువంశీ తల్లి

షిల్లాంగ్, జూన్ 9: ఆలే అసలు విలన్‌లా మా రి.. భర్తను హత్య చేయించింది. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి.. అదృశ్యం అయిన నవదంపతుల కేసులో విస్తుపోయే విషయాలు బయ టకు వచ్చాయి. భర్త రాజా రఘువంశీని కట్టుకున్న భార్యే కడతేర్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరీ భర్తను మట్టుబెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. సోనమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోనమ్‌కు రాజ్‌కుశ్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉండేదని, అతడే రఘువంశీ హత్యకు పథకం వేశాడని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

రూట్ దొరికిందిలా.. 

ఇండోర్‌కు చెందిన రఘువంశీ మే 11న వివాహం జరిగింది. ఈ నవదంపతులిద్దరూ  పెండ్లి తర్వాత హనీమూన్ కోసం మే 20 న మేఘాలయకు వెళ్లారు. మే 22వ తారీఖున ఈ జంట ఓ ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకుని మౌ లాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బైక్‌ను పార్క్ చేసి అక్కడే ఉన్న ప్రసిద్ధ లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లి మాయమైపోయారు.

ఇలా అదృశ్యమైన11 రోజుల తర్వాత సోహ్రాలోని ఓ జలపాతం వద్ద లోతైన లోయలో రఘువంశీ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సోనమ్ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు మేఘాలయ డీజీపీ ప్రకటించారు.

వెంటనే ఆమెను అరెస్ట్ చేసినట్టు, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. భర్త రఘువంశీని చ ంపేందుకు సోనమ్ తమకు సుపారీ ఇచ్చిందని ని ందితులు విచారణలో వెల్లడించారు. 

సోనమ్ కి‘లేడీ’..

రఘువంశీ కుటుంబం పూర్తిగా అంగీకారం తె లపకముందే హనీమూన్ కోసం సోనమ్ అన్ని ఏర్పాట్లు చేసిందని రఘువంశీ తల్లి ఆరోపించారు. ‘నా కుమారుడికి ఆ ప్రాంతం గురించి సరిగ్గా తెలియదు. వెళ్లే ముందు హనీమూన్ గురించి చెప్పాడు. అక్కడికి వెళ్లాక సోనమ్ ట్రిప్‌ను మరింత పొడిగించింది. వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసింది కానీ వచ్చేందుకు మాత్రం టికెట్లు బుక్ చేయలేదు.

నాకు అనుమానం రాకుండా ఉండేందుకు తరచూ ఫోన్ చేసేది. ప్రమాదం జరిగితే సోనమ్ మాత్రం ప్రాణాలతో ఎలా ఉంది. ఒక వేళ రఘువంశీని సోనమ్ హత్య చేయించి ఉంటే ఆమెను ఉరి తీసి.. అందుకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి.’ అని పేర్కొన్నారు.  

నా కుమార్తెకు ఏ పాపం తెల్వదు.. 

ఈ విషయాలపై సోనమ్ తండ్రి దేవీ సింగ్ స్పం దించారు. ‘నా కుమార్తెకు ఏ పాపం తెలియదు. నా బిడ్డపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె అలా చేసి ఉండదు. రెండు కుటుంబాల అంగీకారంతోనే పెండ్లి జరిగింది. మేఘాలయ పోలీసులు అబద్దం చెబుతున్నారు. ఆమెను మేఘాలయలో అరెస్ట్ చేయలేదు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని కోరుతున్నా.’ అని సోనమ్ తండ్రి వెల్లడించారు.

నన్ను నమ్మండి ప్లీజ్.. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ తను అమాయకురాలినని, తను ఈ హత్య చేయలేదని విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. ‘ఈ కేసులో నేను నిందితురాలిని కాదు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. అనంతరం గాజీపుర్‌లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మావాళ్లకు ఫోన్ చేశా.’ అని పేర్కొన్నట్టు సమాచారం.

హోటల్ దగ్గరి నుంచే సోనమ్ ఫోన్ చేసినట్టు హోటల్ సిబ్బంది కూడా వెల్లడించారు. సోనమ్ బాయ్‌ఫ్రెండ్‌గా అనుమానిస్తున్న రాజ్‌కుశ్వాహాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్‌కే చెందిన రాజ్ కుశ్వాహాకు సోనమ్‌తో గత కొంత కాలంగా సాన్నిహిత్యం ఉంది.