calender_icon.png 6 June, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ తరగతి గదుల ప్రారంభం

18-04-2025 01:17:23 AM

కరీంనగర్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): కాశ్మీర్ గడ్డ లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్మార్ట్ డిజిటల్ తరగతి గదులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ పాఠాల ద్వారా విద్యాబోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన వస్తుందని అన్నారు.

ఉపాధ్యాయులు మెళకువలతో పాఠాలను బోధించాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన, జిమ్నాస్టిక్స్, కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు హసీనా ఫాతిమా పాల్గొన్నారు.