18-04-2025 01:14:47 AM
భీమదేవరపల్లి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భీమదేవరపల్లి మండలం లోని అంబేద్కర్ కూడలిని జంక్షన్ చేయాలని మండలంలోని దళిత సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు ముల్కనూరు అంబేద్కర్ కూడలిని జంక్షన్ చేయాలని తెలంగాణ అమరుల స్తూపాన్ని ఇదే స్థానంలో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ , ఆర్డీవో గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జరిగినది.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలా ప్రకాష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం, జేఏసీ చైర్మన్ డ్యగల సారయ్య, కవ్వ లక్ష్మారె,డ్డి జెఎసి హుస్నాబాద్ నియోజకవర్గ చైర్మన్ వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి హుస్నాబాద్ మాజీ సర్పంచ్ మంగ రామచంద్రం,అంబేద్కర్ సంఘ నాయకులు మాడుగుల ఈశ్వరయ్య, బీసీ సంఘ నాయకులు వేముల జగదీష్ పాల్గొన్నారు.