19-09-2025 11:33:04 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్
కామారెడ్డి,(విజయక్రాంతి): న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కామారెడ్డి బారసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు.