24-06-2025 08:15:06 PM
కోదాడ: మండలంలోని అల్వాలపురం గ్రామ రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో మంగళవారం నాయకులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు ఏఓ రజిని ఏఈఓ నాగేశ్వరరావు, కోదాడ మార్కెట్ డైరెక్టర్లు మల్లు నాగిరెడ్డి, బోలు ప్రసాద్ రైతులు పాల్గొన్నారు.