24-06-2025 08:16:52 PM
మండల విద్యాధికారి ప్రకాష్..
మహాదేవపూర్ (భూపాలపల్లి) (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలంలో జూన్ 6వ నుండి 19 తేది వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో నూతనంగా 573 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు మండల విద్యాధికారి ప్రకాష్(Mandal Education Officer Prakash) ఓ ప్రకటనలో తెలిపారు.
మండల కేంద్రంలో మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత (బాలురు, బాలికలు) పాఠశాలల ఆవరణంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో మండల విద్యాధికారి ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... మహదేవపూర్ మండలంలో ఈనెల 6 నుండి 19 తేది వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈ విద్య సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు, విద్యార్థులు మొగ్గు చూపారని, అందుకనుగుణంగా ఈ సంవత్సరం కొత్తగా 573 మంది విద్యార్థిని విద్యార్థులు మన మహాదేవపూర్ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో ప్రవేశం పొందడం జరిగిందని అన్నారు.
ప్రైవేట్ పాఠశాలల నుండి 245 మంది విద్యార్థులు, వివిధ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల నుండి 328 మంది విద్యార్థులు ప్రవేశం పొందడం జరిగిందని తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్ధులను మనం కాపాడుకొని మంచి ఫలితాలను తీసుకొచ్చినట్లయితే మున్ముందు ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అందుకు గాను ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేసి తాము పనిచేస్తున్న పాఠశాలకు మండలానికి మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, ఉపాధ్యాయులు రాజేందర్, రవీందర్, కళ్యాణి, రత్న తిరుపతిరెడ్డి, సరావత్ సుల్తానా, మొండయ్య, ఎర్రయ్య, పద్మ,తదితరులు పాల్గొన్నారు.