15-12-2025 02:18:49 AM
మనోహరాబాద్, డిసెంబర్ 14: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగం గా ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పిటి గ్రా మంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొట్టుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వా రిని చెదరగొట్టారు. పోలింగ్ సెంటర్ వద్ద ఇ రు వర్గాల నాయకులు, కార్యకర్తలు తమకంటే తమకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరు వర్గాల నాయ కులు ఘర్షణలకు దిగారు.
ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగి కొట్టుకున్నారు. కాగా ఈ గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో గజ్వేల్ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి వర్గానికి చెందిన మన్నె కళ్యాణ్ ముదిరాజ్ సర్పం చ్ అభ్యర్థిగా ఉన్నారు. ఈయనకు కాంగ్రెస్ నాయకులు మాజీ మండల రైతు సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఆయన సోదరులు మాజీ సర్పంచ్ ప్రభాకర్రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ విట్టల్రెడ్డి మద్దతుగా ఉన్నారు.
బిజెపి నాయకుడు భాష బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈయనకు మద్దతుగా బిజెపితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైలంపల్లి హనుమం తరావు వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు మద్దతుగా ఉండి ప్ర చారం నిర్వహించారు.