17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఇరాన్ పై అమెరికా దాడి పట్ల వామపక్షాల నిరసన

24-06-2025 06:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇరాన్ పై అమెరికా దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల  నాయకులు సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, పాయం చిన్న చంద్రన్న, గౌని ఐలయ్య పెరుగు కుమార్, మదార్ మాట్లాడుతూ... ఇరాన్ పై అమెరికా వెంటనే దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రెండు వారాల్లో ఇరు దేశాల మధ్య శాంతి చేస్తానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు అమెరికా ఇరాన్ పై దాడులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు.

చమురు నిల్వల కోసం అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధం ఆపే విధంగా ట్రంప్ తో మాట్లాడాలన్నారు. ప్రపంచ ప్రజలందరూ యుద్ధం అపాలని ఆందోళన చేస్తుంటే ట్రంప్ యుద్ధం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు చింత కుంట్ల వెంకన్న, వెలుగు శ్రవణ్, హాలవాత్ లింగ్య, సామా పాపన్న, అల్వాల వీరన్న, కుంట ఉపేందర్, దుడ్డెల రామ్మూర్తి, కొత్తపల్లి రవి, సూరి, అబోతు అశోక్, రాగం మల్లయ్య, కుమ్మరి కుంట్ల నాగన్న, కోటేష్, బాలాజీ, బోళ్ల భద్రయ్య, వేణు, హేమ నాయక్ తదితరులు పాల్గొన్నారు.