24-06-2025 06:22:26 PM
పలు దుకాణాలలో ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని ఆకస్మికంగా తనిఖీ..
ఎంపీడీవో విజయ భాస్కర్..
మునుగోడు (విజయక్రాంతి): నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని మునుగోడు ఇన్చార్జ్ ఎంపీడీవో భాస్కర్(incharge MPDO Bhaskar) అన్నారు. మండలంలోని మునుగోడు మేజర్ గ్రామపంచాయతీ కిరాణా షాపులు, కూరగాయ దుకాణాల ఆకస్మిక తనిఖీ చేశారు. సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లు లేదా ఇతరత్రా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు విక్రయిస్తున్నారని పరిశీలించారు.
నిబంధనలకు విరుద్ధంగా అమ్మిన దుకాణ యజమానులకు 13 వేల రూపాయల జరిమానా విధించారు. షాపుల నందు ఉన్న ప్లాస్టిక్ను, ప్లాస్టిక్ కవర్లను గ్రామపంచాయతీ జప్తు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ ని అమ్మినట్లయితే, వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మునుగోడు గ్రామాన్ని ఐక్యంతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ తనిఖీలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ భాస్కర్, మండల పంచాయతీ అధికారి స్వరూప రాణి, మునుగోడు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.