అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి
అయిజ మార్చి 10: అయిజ మున్సిపాలిటీలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమాన పరిచిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయం దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు దాడి చేసి వేలు విరగొట్టారని అన్నారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, దీన్ని బట్టి చూస్తే ఇవి ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని, అట్టి దుండగులు చేత ధ్వంసమైనచోట విగ్రహ పునర్నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో ఇట్టి దాడులకు పాల్పడకుండా దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
స్థానిక ఎసై శ్రీనివాసరావు వచ్చి దీని కారకులను గుర్తించి అరెస్టు చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కౌన్సిలర్ మద్దిలేటి, దండోరా జిల్లా మాజీ నాయకులు రాజు, జై భీమ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకా ష్,మైనర్ బాబు మొదలగువారు పాల్గొన్నారు.




