అలిపిరి టోల్ గేట్ వద్ద చిరుతపులి
హైదరాబాద్: తిరుమల(Tirumala) సమీపంలోని అలిపిరి టోల్ గేట్(Alipiri toll gate) వద్ద చిరుతపులి కనిపించింది. దీనితో టీటీడీ విజిలెన్స్ అధికారులు(TTD Vigilance Officers) నడకదారి వెంట భక్తుల భద్రతను నిర్ధారించడానికి అప్రమత్తం అయ్యారు. టోల్ గేట్ దగ్గర చిరుతపులి ఒక జింకను చంపింది. భక్తుల నుండి సమాచారం అందుకున్న విజిలెన్స్, అటవీ శాఖ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని జింకను పశువైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనతో అధికారులు చిరుతను పట్టుకోవడానికి పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని గుంపులు వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు.
ఇవీ చదవండి:
లారీని ఢీకొట్టిన కారు: ఐదుగురు అక్కడిక్కడే మృతి
బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం: 50 దుకాణాలు బూడిద, రూ.కోటి నష్టం
ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బాల్క సుమన్ విడుదల




