31-05-2025 07:53:23 PM
గజ్వేల్: నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా విజయ రామారావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు నాచారం ఈవోగా బాధ్యతలు నిర్వహించిన విశ్వనాథ శర్మ శనివారం పదవీ విరమణ చేశారు. కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ పనిచేస్తున్న విజయ రామారావు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు చేపట్టారు.