01-07-2025 12:07:07 AM
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
కొత్తకోట జూన్ 30 : కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం భాగస్వామ్యం అవుదామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గరల్స్ హైస్కూల్ వద్ద 33,50 లక్షల నిధులతో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిదంగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వివర్స్ కాల నీలోని నాగరాల తిరుపతి రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ పామాయిల్ సాగుతో అధిక లాభాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.