01-07-2025 12:05:00 AM
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తొండ ఆంజనేయులు
పెబ్బేరు జూన్ 30 : మండల పరిధిలోని గుమ్మడం గ్రామానికి చెందిన తొండ ఆంజనేయులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసారు. గత పది సంవత్స రాలుగా మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నానని ఆవేదన చెందారు. నాకు ఎటువంటి స్థిరాస్తులు లేవని, అదే క్రమంలో పది, ఐదు ఎకరాలు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని అన్నా రు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల కమిటీ తప్పుడు నిర్ణయం వల్ల ఎంపిక జాబితా లో ఉన్నప్పటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి నాకు న్యాయం చేయాలనిడిమాండ్చేశారు.