22 April, 2026 | 1:56 AM

ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం

22-04-2026 12:47 AM

అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్ పర్సన్ : తోట లహరి

వేములవాడ, ఏప్రిల్ 21,(విజయక్రాంతి)వేములవాడ 4వ వార్డు,మహాలక్ష్మి వీధికి చెందిన పెంట మల్లేశం మరణించగా, అంత్యక్రియల అనంతరం వారి కుటుంబానికి అన్నపూర్ణ స్వచ్ఛంధ సేవ సంస్థ చైర్ పర్సన్ తోట లహరి ద్వారా ఉచితంగా భోజనం అందించారు. పెంట స్వరుణ్, రవి ప్రిన్స్ సమాచారం మేరకు సకాలంలో భోజనం పంపించినట్లు చైర్పర్సన్ తోట లహరి తెలిపారు.పట్టణంలో ఎవరైనా మరణించిన సందర్భంలో ట్రస్ట్ నంబర్ 8919376459 కు సమాచారం ఇస్తే బాధిత కుటుంబాలకు ఉచితంగా భోజనం అందిస్తామని ఆమె తెలిపారు.