03-06-2025 12:33:11 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్, జూన్ 2: నల్లగొండ జిల్లా సర్వోతో ముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి పని చేద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం ఆయన నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఎంతోమంది పోరాటాల వల్ల తెలంగాణ సాధించుకోగలిగామని, తాను సైతం తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందని, నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపమని, పోరాటాల పొద్దుపొడుపు అని , అలాంటి నల్గొండలో పుట్టడం సంతోషమని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే తెలంగాణ రైజింగ్- 2047 పేరున పేదల సంక్షేమం కోసం సమగ్ర పాలసీలను రూపొందించిందని ,ప్రపంచ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు.
ఆడబిడ్డల సంక్షేమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా ,203 కోట్ల 78 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగిందని,500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం కింద రెండు లక్షల 34994 మంది లబ్ధిదారులకు 6 లక్షల 47 వేల సిలిండర్లు ఇవ్వగా ,ప్రభుత్వం సబ్సిడీ కింద 18 కోట్ల 58 లక్షలు రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు.
మహిళలకు ఇందిరమ్మ ఇండ్లతోపాటు ,విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందిరా మహిళ శక్తి పథకం కింద జిల్లా కలెక్టర్ కార్యాలయా ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నామని తెలిపారు. రుణమాఫీ కింద జిల్లాలో రెండు లక్షల 33,981 మంది రైతులకు రెండువేల44.8 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద ఈ యాసంగి లో ఇప్పటివరకు 4,33543 మంది రైతులకు సుమారు 414 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేయడం జరిగిందని ,యాసంగి ధాన్యం సేకరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఐదు లక్షల 91729 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచామని, రైతులకు ఖాతాలలో 1210 కోట్ల రూపాయలను చెల్లింపులు చేసినట్లు చెప్పారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు సాలినా 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసేందుకు 25603 కుటుంబాలను గుర్తించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో నాలుగు లక్షల 84210 మంది కుటుంబాలకు 997 చౌక ధర దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు జిల్లాలో చొప్పున 8 వేల 868 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేసామని, పారదర్శకంగా కుల గణన నిర్వహించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ,యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం జరిగిందని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో భాగంగా ,నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండ, మునుగోడు నియోజక వర్గాలలో ఈ పాఠశాలలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని, భవిత కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఒక కోటి 20 లక్షలు అనుమతులు ఇచ్చామని ,అన్ని పాఠశాలలకు మూడు లక్షల 54 వేల పాఠ్య పుస్తకాలు, 6 లక్షల 20వేల నోట్ పుస్తకాలు ఇచ్చామని ,జిల్లాలో నాలుగు ఐటిఐ లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఆధునికరించెందుకు టాటా టెక్నాలజీతో 31 కోట్ల5 లక్షలు, ప్రభుత్వం నాలుగు కోట్ల 74 లక్షల రూపాయల అత్యాధునిక మిషనరికి ఖర్చు చేసిందని ,నల్గొండ ఐటిఐ ప్రాంగణంలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు .
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాలో 19698 గృహాలను కేటా యించి 16,412 గృహాలకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని, మొదటి విడతన 1906 గృహాలు మంజూరు చేయగా 610 గృహాలు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు వెళ్లేందుకు నామ్ రోడ్డు పనులను కలుపుతూ నాలుగో వరుసల సిసి రోడ్డు నిర్మాణానికి 236 కోట్లు మంజూరు చేయబడ్డాయని, ఇవి ప్రారంభ దశలో ఉన్నాయని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. జిల్లాలో 86 కోట్ల 80 లక్షల రూపాయలతో 35 ఉపవిద్యుత్ కేంద్రాలు మంజూరయ్యాయని వెల్లడించారు .
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంట సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.బాల భవన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన ఆరుగురికి జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. అభివృద్ధిని తెలిపే విధంగా శకటాల ప్రదర్శన ,స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముందు మంత్రి క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాల నుంచి అమరులకు నివాళులర్పించారు.
సమ్మిళిత వృద్ధికి ఒక నమూనా తెలంగాణ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, జూన్ 2 (విజయక్రాంతి) : సమ్మిళిత అభివృద్ధికి ఒక నమూనా తెలంగాణ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫ రాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమా ర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగాలు రాష్ట్ర అభివృద్ధి ప్రయాణానికి పునాదులు అయ్యాయన్నారు.
దీంతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తుందన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రీన్ ఎనర్జీ, ఆవిష్కరణ, పరిశ్రమ, పర్యాటకం, పారదర్శక పాలనలో తెలంగాణను జాతీయ స్థాయిలో అగ్రగామిగా మార్చడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ - 2047‘ విజన్ సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు.
తెలంగాణ వృద్ధిలో రైతులే కేంద్రబిందువనీ అది గుర్తించే గత 18 నెలల్లో 25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్ల పంట రుణ మాఫీ అందించడం ద్వారా ప్రయోజనం పొందారన్నారు. పండిన ప్రతి వరి గింజను కనీస మద్దతు ధరతో సేకరించామని, 24 గంటల్లోపు చెల్లింపులు జమ కావడం సత్వర సేవలకు, రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. ప్రభుత్వం సన్న వరి ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించిందనీ ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచిందన్నారు.
రాష్ట్రంలోని రైతులు 2.9 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేయగా ఇది దేశంలోనే అత్యధికంగా వరిని అందించే రాష్ట్రాలలో తెలంగాణను నిలిపిందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందన్నారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, కే నరసింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, మహిళలు ప్రజలు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో
యాదాద్రి భువనగిరి జూన్ 2 ( విజయ క్రాంతి ) ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవ వేడుకలు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌ,, శ్రీ సుఖేందర్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డిసిపి అక్షాంష్ యాదవ్ తో కలసి పోలీసు వందనం స్వీకరించారు .
తెలంగాణ తల్లి, మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళాలు అర్పించారు.అనంతరం జాతీయ పతాకావిష్కరణ గావించారు. తదుపరి జిల్లా ప్రగతి నివేదికను ప్రసంగించారు. ఈ సందర్భంగా చైర్మన్ తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్తు గౌ,, శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుచున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థినీ, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన 67 మంది విద్యార్థిని, విద్యార్థులకు నిర్మాణ సంస్థ (CSR) రాజేష్ అనూష, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి కైలాస్ ల వారి సహకారంతో 67 మందికి సైకిళ్లను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి , అడిషనల్ డి.సి.పి లక్ష్మీ నారాయణ,జెడ్పీ సి. ఈ. ఓ శోభా రాణి, ఏ సి పి రాహుల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబు రావు, ఆర్డీవో కృష్ణా రెడ్డి, డిఆర్ డి ఓ నాగిరెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ జాతీయ పతా కాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా సుదీర్ఘకాలం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకు న్నామని వారు గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకా ంక్షలను గౌరవించి, తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యపేట.
సూర్యాపేట, జూన్ 2 (విజయక్రాంతి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మాజి రాజ్యసభ సభ్యులు, బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలను, బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జడ్పిటిసి జిడి బిక్షంలతో పాటు బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ
వలిగొండ,జూన్ 2 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని తెలంగాణ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఎస్త్స్ర యుగంధర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, ఏవో అంజనీ దేవి, మచ్చగిరి గుట్ట చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, నాయకులు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, బత్తిని లింగయ్య, బత్తిని సహదేవ్, జక్కజంగారెడ్డి, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, బత్తిని వరుణ్, మామిడి నరేందర్ రెడ్డి, చిలుకూరు సత్తిరెడ్డి, బాల నరసింహ, తిరుపతయ్య, కీర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్).
తిరుమలగిరి (సాగర్), జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య ముదిరాజ్ మాట్లాడారు. నాయకులు చవ్వ నాసర్ రెడ్డి, పోతుగంటి తిరుమల్, నాగేండ్ల వెంకటరెడ్డి, రమేష్ నాయక్, కార్తీక్ గౌడ్, హాతిరాం నాయక్, కోట్యా నాయక్, మల్లికార్జున్, రాంబాబు, నర్సింగ్ వెంకటేశం, ఆంజనేయులు, లింగాల మొగలయ్య పాల్గొన్నారు.