13-01-2026 09:25:23 PM
* సురక్షిత ప్రయాణమే... జీవితానికి శ్రీరామరక్ష
* జవహర్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
జవహర్ నగర్,(విజయక్రాంతి): రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలను అరికడదామని, సురక్షిత ప్రయాణమే నిండు జీవితానికి శ్రీరామ రక్ష అని జవహర్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీసీ వెంకట్ రెడ్డిల ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో జవహర్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్రమత్తతతోనే ప్రమాదాలను అరికట్టాలని అన్నారు. ప్రాణ రక్షణకోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపరాదని సూచించారు. అనంతరం వాహనదారులు, ప్రజలతో కలిసి రోడ్డు భద్రతా ప్రతిజ్ఞను చేయించారు.