16-05-2025 01:38:14 AM
-ప్రధాని నేతృత్వంలో కూకటివేళ్లతో పెకిలిస్తాం
-అంబర్పేట్ తిరంగా ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-17న జరిగే భారీ తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఉగ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామన్నారు.
గురువారం అంబర్పేట్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొని, పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే 17న ట్యాంక్బండ్ వద్ద పెద్దఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ర్యాలీ ద్వారా భారత సైనికుల మనోస్థుర్యైన్ని పెంచాలని, ప్రతీ ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో అన్ని సంఘాలు, కులాలు, మతాలు, ప్రముఖులు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొంటున్నారని చెప్పారు. ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించే వరకూ వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. భారత సైనికులు భవిష్యత్లోనూ ఇదే తరహాలో విజయం సాధించి సత్తా చాటాలని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి కోరారు.