పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

23-04-2024 01:28:07 AM

ధరిత్రీ దినోత్సవంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : హనుమకొండ కలెక్టరేట్ ఆవరణ లో సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌తోపాటు ఇతర కాలుష్య కారకాల వినియోగం తగ్గించినప్పుడే భూమికి మేలు చేసి నవారమవుతామని తెలిపారు. కలెక్టరేట్‌లో నాలుగు నెలలుగా ప్లాస్టిక్ వాడకం నిషేధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యా వరణ హితమైన సంచులను కలెక్టర్ చేతులమీదుగా వివిధ శాఖల అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, వెంకట్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఆర్‌ఓ వైవీ గణేష్, డీఆర్‌డీఓ నాగపద్మజ, జిల్లా సంక్షేమాధికారి కే మధురిమ తదితరులు పాల్గొన్నారు.