కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
వనపర్తి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కనీస మౌలిక సౌకర్యాలు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పెద్దమందడి మండలం జగత్పల్లి, మణిగిల్ల గ్రామాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సోమవారం సందర్శించి ఓటర్ల జాబితాలను పరిశీలించారు. అనంతరం మణిగిల్ల శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రం ఇన్చార్జ్కు సూచించారు. వైద్యం కోసం వచ్చేవారికి సిబ్బంది అందుబాటులో ఉండి సేవలను అందించాలని సూచించారు. పెద్దమందడి మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు.