వనపర్తి, ఏప్రిల్ 22 ( విజయక్రాంతి ) : కనుమరుగవుతున్న కులవృత్తులకు మాజీ సీఎం కేసీఆర్ జీవం పోశారని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. శ్రీరంగాపురం మండలం తాటిపాములలో నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా సోమవారం ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్య్సకారులతో ముచ్చటించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.