2 May, 2026 | 7:23 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

సవారి కచ్రంలో చలో..

21-10-2024 12:00 AM

ఆరోజుల్లో ఆచార వ్యవహరాలే కాదు.. రవాణా సదుపాయాలు కూడా తెలంగాణలో చాలా గమ్మత్తుగా ఉండేవి. సామాన్యులు దాదాపుగా నడిచే గమ్యస్థానాలకు చేరుకునేవారైతే.. భూమి ఉన్న రైతు కుటంబాలు మాత్రం సవారి కచడాన్ని (కచ్రం) రవాణా సదుపాయంగా వాడేవారు. పొలంకాడికి పోవాలన్నా.. పొలిమేర దాటాలన్నా.. ఆడబిడ్డను మరో ఊరు నుంచి పండక్కి తీసుకురావాలన్నా సవారి కచడంపై వెళ్లేవారు.

జంట ఎడ్లు గజ్జెల సప్పుడు చేసుకుంటే వెళ్తుంటే.. దర్జాగా ప్రయాణించేవారు. ఎండకు, వానకు తట్టుకునేలా అప్పట్లో మంచి రవాణా సదుపాయంగా ఉపయోగడింది. ఆ తర్వాత ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు రావడంతో సవారి కచడం కనుమరుగైంది. అయితే ఆ రోజుల్లో మాత్రం సవారి కచడం ఓ బెంజీకారు మాదిరిగా చెలామణీ అయ్యిందంటే అతిశయోక్తి కాదు.