16-06-2025 12:00:00 AM
పగలంతా పనిచేసి వచ్చిన శ్రామికుడికి శ్రావ్యమైన గానం వినబడితే ఎంత హాయిగా ఉంటుంది! ఆకలితో అల్లాడిపోతున్న వాడికి కమ్మని భోజనం లభిస్తే ఎంత తృప్తిగా ఉంటుంది! ఎన్నడూ గడప దాటని వాడిని తీసుకెళ్ళి రమణీయ ప్రకృతి దృశ్యాన్ని చూపెడితే ఎంత సంతో షంగా ఉంటుంది! ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడితో అలసి సొలసిన పాఠకులకు ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయిలు చదివితే అంత హాయిగా, తృప్తిగా, సంతోషంగా ఉంటుంది.
‘కాలువలో నీళ్ల పరుగు దెంత సోయగం/డొంకల్లో బండిపయ్య దెంత సోయగం /ఆధునికత బూచెత్తుక పోయెను కానీ/ కొండమీద ఊగు చెట్ల దెంత సోయగం’. ఇది చాలదా ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలలో సౌందర్యం సాక్షాత్కరిస్తుందనడానికి.
ఆయన కవిత్వంలో కాలువ గానం చేస్తుంది. వంతెన ధ్యానం చేస్తుంది. ప్రకృతి నాట్యం చేస్తుంది. పొగడ పూ లు గాలికి తలలూపుతుంటవి. గరికపూలు గట్టున రంగద్దుతుంటవి. కొలను తామరలెల్ల వికసిస్తాయి. నింగి మేఘపు రాశి మురిపిస్తుంది. నూత్న వర్షపు శోభ పరచుకుంటుం ది. వానదేవి అప్పుడపుడు పూలు జల్లిపో తుంది. శీతగాలి చెంపలపై ముద్దుపెట్టి పోతుంది. ఆకాశం కిందికొచ్చి ముద్దులా డి పోతుంది.
పవన కన్య ప్రతి కాలం నాట్యమాడి పోతుం ది. వాననీరు కొమ్మకొసల ఊయలూగు తుంటది. చిరుగాలికి పెను మబ్బులు కరిగి పోతవి. చిరుజల్లుకు పెనుగొండలు తడిసిపోతవి. చెట్లు మురి సి, రాళ్ళు తడిసి పులకరిస్తే, కొండవెనుక ఇంద్రధనస్సు తొంగిచూస్తది. కాలువలో చందమామ ఊయలూగుతుంటది. పొలం గట్టున కాలువలకు పులకరింతలు ఉం టవి. గాలి రాక చూసి చేలు పలకరిస్తాయి.
చేల యెదన చేయేస్తూ గాలి పలకరిస్తుంది. చెట్లమీద వాలేందుకు పిట్టలు తిరిగొస్తాయి. ఊరిజనుల ముఖాలలో కాంతులు తిరిగొస్తాయి. పావురాళ్లు బృందంగా ఎగురుతాయి. చీమలన్నీ సోల్పూతుగ నడుస్తాయి. పువ్వులు బతుకమ్మకు తీరైన వన్నెలద్దుతాయి. గలగల లాడే కాలువలు, కళకళలాడే లోగి ళ్ళు, పరవశమొందే పల్లియలు కనిపిస్తాయి. రాతిలోన సప్తస్వరాలు, కొండలోన ప్రతిధ్వనులు, ఏటినీటిలో గలగలలు వినిపిస్తాయి.
‘ఓ రుబాయిలో వాన కొంటెతనం ఉంటుంది/బ స్టాండుల నిలుచుంటే తాకజూస్తది/ గొడుగు పట్టుకున్నా ముద్దాడ జూస్తది/ తడిసి మురుద్దామంటు బయటికొస్తిమా/తుంటరిదీ వాన అపుడు వెలియజూస్తది’. ఆయన కవిత్వంలో పాప- - వీణ మోగినట్లు పాడుతుంది. కొమ్మ ఊగినట్లు ఆడుతుంది. ఆత్మ వెలిగినట్లు నవ్వుతుంది. జవ్వని- దూదిపింజ లాగ, ఇంద్రధనస్సు లాగ, జలపాతం కదలికోలె నవ్వుతుంది. తరుణుల ప్రతి కదలికలో దైవత్వం ఉంటుంది.
ఈ కవికి ప్రభాతం సరికొత్త ఊహలిస్తది. సాయంత్రం వినూత్న పలుకులిస్తది. ప్రకృతి నవశక్తులిస్తది. దారి కొసదాక చూపులను, నింగి కొసదాక మనసును, బతుకు కొసదాక కలలను పరుస్తారు. తీరాలను కలిపినందుకు వాహికకు, దూరాలను చెరిపినందుకు వంతెనకు, పాృదయాలను దరిచేర్చిన ప్రణయాలకు వందనం చేస్తారు. ఆనందం కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతాం.
కాని ‘అంతరంగపు టంతరంలో దాగున్నది ఆనందం. స్వచ్ఛమైన స్వభావాన కూర్చున్నది ఆనందం’ అని ఎరుక పరు స్తారు. ‘మనసులోని అందాలకు కొలమానం లేదు. ప్రేమించడంలో మునిగిపో, ద్వేషించలేవ్’ అంటారు. ‘నిను వలచుట కాదు వింత/ నువు వలచుట కాదు వింత /విశ్వప్రేమ భావనలో/వలచి చూడు జగము వింత’ అని అవధులు లేని ప్రేమను చాటుతాడు.
ఆయన మనసు పిట్టలు ఎగురుతుంటయ్. ఊహ లోకము లెగురుతుంటయ్. ఈ కవికి అడుగు తీసి అడు గు వేస్తె ఎన్ని ఊహలు! కన్ను తీసి కన్ను తెరిస్తే ఎన్ని ఊహలు! ‘గంతు లేసే కాలం కావాలని, నవ్వి తుళ్ళే రోజు లు రావాలని’ కలలు కంటారు. ‘జననమందిన రోజు అపురూపమే/కల్యాణ గడియలూ అపురూపమే/ మన సు లోపల మమత నిండిపోతే/ కొత్తేటి తొలిరోజు అపురూపమే’ అని ఉత్సాహ పడతారు.
అంతేకాదు. ‘పరవశిం చే లోకముంటే/ పులకరించే లోకముంటే/ఎగిరిపోనా ఇప్పుడిపుడే/తనివి తీరే లోకముంటే’ అని పాడుకుంటా రు. ‘ఆలోచన పిట్ట నలా ఎగరనీ/ ఊహ గాలిపటాన్నలా ఎగరనీ/ దాచేస్తే దాగుతుందా హృదయం/ మనోసంద్ర కెరటమలా ఎగరనీ’ అని పరవశిస్తారు. ‘చినుకు హెుయ ల విలాసాలు చూసేద్దాం. ప్రకృతిలో విన్యాసం చూసే ద్దాం’ అంటూ అందరినీ ఆహ్వానిస్తారు.
ఈ కవికి ‘మట్టిని ఎవరైనా చిత్రిస్తే బాగుండు నింగిని ఎవరైనా పట్టిస్తే బాగుండు. చీకటి నెవరైనా దాపెడితే బాగుండు’ వంటి చిత్రమైన కోరికలుంటాయి. ‘చెరువులోన కొంగ మనసు ఏమంటుంది/చెట్టుమీద పిట్ట తల పు ఏమంటుంది/ జీవజాల భాషలెపుడు మనకు తెలియునొ/ నింగి ఎగురు కాకి పలుకు ఏమంటుంది’ వంటి ఊహలుంటాయి. ‘ఎల్లప్పుడు పిల్లలోలె ఊహలొస్తె బాగుండు/ ఊహలన్ని నిజమయ్యే కాలమొస్తె బాగుం డు’ వంటి ఆశలుంటాయి.
‘వసుధ ఒక్కటనే మాట నిజమైతే బాగుండు’ వంటి ఆశయాలుంటాయి. ‘భువినే ఓ స్వర్గంగా మార్చుకునే రోజెప్పుడు?’ అని ఎదురు చూస్తా రు. ‘ఊహలు గుసగుసలాడే రోజులు ఉంటాయి/ నీలిమ మిలమిలలాడే రోజులు ఉంటాయి/హృదయంలో కల్మషాలు విడిచిపెట్టి చూడు/ వెలుగులు నివ్వెరపోయే దివ్వె లు ఉంటాయి’ వంటి గొప్పనైన రుబాయిలు ఈ పుస్తకంలో ఉంటాయి. వీటన్నింటిలో భాషా, భావ, ప్రకృతి సౌందర్యాలు పెనవేసుకొని ఉంటాయి. చదివిన కొద్దీ చదవాలని అనిపిస్తాయి. విన్నకొద్దీ వినాలనిపిస్తాయి. ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలు పాఠకులకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి.
తెలంగాణ రుబాయిలు,
రచన: ఏనుగు నరసింహారెడ్డి, పేజీలు: 299,
వెల: రూ.200/- ప్రతులకు: పాలపిట్ట బుక్స్,
నవతెలంగాణ బుక్హౌజ్, నవోదయ బుక్హౌజ్.
కవి సెల్ నంబర్: 89788 69183
ఎ. గజేందర్ రెడ్డి