09-01-2026 12:07:12 AM
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : 2047 నాటికి తెలంగాణను రూ.3 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ద డంలో లైఫ్ సెన్సైస్ రంగం కీలక భూమిక పోషిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సెన్సైస్, హెల్త్-టెక్ సదస్సుగా పేరుగాంచిన బయోఏషియా- 2026(23వ ఎడిషన్) అధికారిక పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ... ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు హైద రాబాద్లో జరగనున్న బయో ఏషియా సద స్సు ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమైనట్టు తెలిపారు. బయో ఏషియా వంటి అం తర్జాతీయ సదస్సులు తెలంగాణ నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడంతో పాటు, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు.
బయో ఏషియా -2026తో టెక్బయో విప్లవాన్ని ముందు కు నడిపిస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్ కో సం ప్రపంచ నిపుణులను హైదరాబాద్లో ఒకే వేదికపైకి తీసుకురావడం తమ లక్ష్యమని అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజ య్ కుమార్ మాట్లాడుతూ... బయో ఏషి యా 2026 స్టార్టప్లు, పరిశోధకులు, పరిశ్రమల నాయకులు, పాలసీ మేకర్ల మధ్య సహకారాన్ని పెంచే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు.
తెలంగాణ లైఫ్ సెన్సై స్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ... ప్రస్తుత కాలంలో టెక్బయో ఆరోగ్యరంగాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసు కెళ్తోందని చెప్పారు. బయాలజీ, ఏఐ, ఆటోమేషన్, డేటా కలయికతో కొత్త ఆవిష్కరణ లు, పెట్టుబడులు, ప్రభావం కోసం పెద్ద అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.
ఆసియాలో అగ్రగామిగా బయో ఏషియా
రెండు దశాబ్దాలుగా బయో ఏషియా ఆసియాలోనే ప్రముఖ లైఫ్ సెన్సైస్, బయోఫార్మా, హెల్త్-టెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఆసియాలో అగ్రగామి వేదికగా ఎదిగింది. ప్రతి ఎడిషన్లో ప్రపంచ స్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. అత్యాధునిక శాస్త్రీయ ప్రగతిని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ బయోఫార్మా, వ్యాక్సిన్లు, మెడ్టెక్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణల గ్లోబల్ హబ్గా మరింత బలపరుస్తోంది.
రాష్ర్టంలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన శాస్త్రవేత్తల ప్రతిభ ఈ ఎదుగుదలకు పునాదిగా నిలుస్తున్నాయి. ఈసారి బయో ఏషియా 2026ను ‘టెక్బయో అన్లీష్డ్, ఏఐ, ఆటో మేషన్ అండ్ బయో రెవల్యూషన్’ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. ఈ థీమ్ ద్వారా బయాలజీ, డేటా, డీప్ టెక్నాలజీ కలయికతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఆవిష్కరణలు, నిర్ధారణ పద్ధతులు, థెరపీ తయారీ, ఆరోగ్య సేవల అందజేతలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను ప్రతిబింబిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాగస్వాములను 2026 ఫిబ్రవరి 16-18 తేదీల్లో హైదరాబాద్లో జరిగే బయో ఏషియా 2026లో పాల్గొని పెట్టుబడి అవకాశాలను అన్వేషించవలసిందిగా, భాగస్వామ్యాలను బలోపేతం చేయవలసిందిగా, టెక్బయో విప్లవంలో భాగస్వాములు కావలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.