12 July, 2026 | 2:34 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

భాషా పండిత పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి

07-07-2024 01:10 AM

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): అప్‌గ్రేడ్ పోస్టుల పదోన్నతుల తర్వాత రాష్ట్రం లో మిగిలిన లాంగ్వేజ్ పండిట్ (భాషా పం డిత) పోస్టులను సైతం అప్‌గ్రేడ్ చేయాలని, అ ర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీటీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్.నర్సింహులు, రాష్ట్ర కోశాధికారి కట్టా గిరిజా రమణ శర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం ఈమేరకు హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అప్‌గ్రేడ్ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, మిగిలిన వారికి కూడా పదోన్నతులు కల్పించాలన్నారు. తద్వారా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు బలోపేతమవుతాయన్నారు.