14-06-2025 12:42:05 AM
నాగల్ గిద్ద, జూన్ 13 : నాగల్ గిద్ద మండలంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శేరీ దామరగిద్ద, ముక్టపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చేరిన విద్యార్థిని, విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఈవో మన్మథ కిషోర్ పాల్గొన్నారు. ప్రభుత్వ బడి అమ్మ ఒడిలాగా చూసుకుంటారని ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడిలో చేర్పించాలన్నారు.
అనంతరం ముక్తాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో పాల్గొన్నారు. ముక్తాపూర్ పాఠశాలలో మనూరు మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ పటేల్ నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా నోట్ పుస్తకాలు పలకలు, సామాగ్రిలు ఎంఈవో చేతుల మీదుగా అందించడం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చౌహన్ గణపతి, బాబు శెట్టి ,మండల పిఆర్టియు అధ్యక్షులు రమేష్, పాండు చారి, దత్తు రెడ్డి కాలేజ్ ఉపాధ్యాయులు రాఘవేందర్ గౌడ్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
తుఫ్రాన్లో..
తూప్రాన్, జూన్ 13 : మూడేళ్లు నిండిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేసే కార్యక్రమాన్ని తూప్రాన్ మండలంలోని నరసంపల్లి పాఠశాలలో ఏర్పాటుచేసి నిర్వహించారు. ముఖ్యంగా మూడు సంవత్సరాలలోపు నిండిన చిన్నారులకు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమక్షంలో అక్షర అభ్యాసానికి బీజం వేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జింక మల్లేశం, మాజీ సర్పంచి కత్తుల సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు విన్నారెడ్డి, ఉపాధ్యాయురాలు జ్యోతి, సెక్రెటరీ రోజా గౌడ్, అంగన్వాడీ టీచర్ చింతల సుగుణ తదితరులుఉన్నారు.