calender_icon.png 2 June, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే

31-05-2025 09:58:29 PM

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 20 అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్(Young India Integrated Residential School) కాంప్లెక్స్ భవన నిర్మాణానికి పాఠశాల విద్యా శాఖ రూ.4,000.00 కోట్ల పరిపాలనా అనుమతి ఉత్తర్వులలో మారుమూల గిరిజన భద్రాచలం నియోజకవర్గానికి గుర్తించి మంజూరు చేయటం పట్ల భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు(MLA Tellam Venkata Rao) రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజన ప్రాంత ప్రజలు చదువుకొని ఉన్నత స్థాయి ఎదగాలని ముందస్తు ఆలోచనతో  విద్యాశాఖ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసిన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డికి భద్రాచలం నియోజకవర్గ ప్రజల తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెంకట్రావు తెలిపారు.