31-05-2025 09:00:18 PM
పటాన్ చెరు: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో కోటి 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే అంతర్గత మురుగునీటి కాలువ పనులకు శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ డీజీఎం శివకృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.