చిహ్నంలో మార్పులు అవసరమా?
31-05-2024 12:05 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్రగీతంగా చేయాలనుకోవడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, చిహ్నం మార్పుపై మాత్రం నిరసనలు వ్యక్తమ వుతున్నాయి. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన చిహ్నంలోని కాకతీయ కళా తోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అనవసర వివాదానికి కారణమవుతోంది. తెలంగా ణ చరిత్రకు రేవంత్ సర్కార్ తూట్లు పొడుస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలి.
-నరేశ్ గౌడ్, నార్సింగి, రంగారెడ్డి జిల్లా.






