12 March, 2026 | 6:06 PM

Breaking News

పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •   ఇది ఆరంభం మాత్రమే.. గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుంది   •  

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..

06-12-2025 05:01 PM

ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి  పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ఎస్పీ డి.చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల/ఇన్చార్జి కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి, వేములవాడ అజయ్ కుమార్ జాదవ్, డీఎస్పీ నాగేంద్రచారి, మేజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి పోలీసు అధికారులు పాల్గొన్నారు.