12 June, 2026 | 4:58 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు

05-11-2024 01:09 AM

ముడాకేసులో 6న విచారణకు హాజరుకావాలని ఆదేశం

బెంగళూరు, నవంబర్ 4: ముడా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం సమన్లు జారీచేశారు. నవంబర్ 6న విచారణకు హాజరుకా వాలని అందులో పేర్కొన్నారు. నోటీసుల విషయమై సీఎం కూడా స్పందించారు.

‘ముడాకు సంబంధించి తనకు లోకాయుక్త నోటీసు అందిందని’ సీఎం తెలిపారు. బుధవారం విచారణకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే.. వ్యవస్థలను ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం యత్నిస్తోందని సిద్ధు ఆరోపించారు. రాజకీయ కుట్రలు, విద్వేషాలకు తన భార్యను సైతం బలి చేశారని సిద్ధరామయ్య బీజేపీ, జేడీయూపై గతంలో మండిపడ్డారు.