9 March, 2026 | 5:29 PM

Breaking News

మహిళా హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు   •   బీజేపీ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌లో చేరిక   •   హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి   •   ప్రజా వాణిలో వచ్చిన ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులుగా చేయాలి   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు   •   అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు   •   ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలి   •   ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు   •   శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెక్కు అందజేత   •  

శెట్టుపల్లి గుట్టపై లారీ పల్టీ

07-02-2026 11:36 AM

మానవత్వం చాటుకున్న సర్పంచ్ ఢిల్లీ వసంత రావు

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని శెట్టుపల్లి గుట్టపై శుక్రవారం రాత్రి 9.50 కి ఒక లారీ నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. శెట్టుపల్లి - కొమరారం మార్గమధ్యమంలో ఈ ఘటన చోటుచేసుకోగా అదే సమయంలో అటుగా వెళ్తున్న శెట్టుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఢిల్లీ వసంత రావు వెంటనే స్పందించి తీవ్ర గాయాలైన లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ను తన వాహనంలో కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సర్పంచ్ ను అభిందించారు.