04-02-2026 05:03:44 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన దీటి నరసయ్య అనునతుడు తన మొబైల్ ఫోన్ పోగా, ఇట్టి ఫోన్ గురించి పోలీస్ స్టేషన్కు రాగా అట్టి మొబైల్ ఫోను ను టెక్నికల్ సహాయంతో సెల్ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లి బ్లూ కోట్ కానిస్టేబుల్ సాయి విహార్, హోంగార్డు శంకరులు అక్క పెళ్లి శివారులో గుర్తించి బాధితుడికి అప్పగించినారు. బాధితుడు వారికి కృతజ్ఞతలు తెలిపినారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.