27-06-2025 08:46:52 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): మాదిగ ఆత్మీయ సమ్మేళనం వాల్పోస్టర్ను మాదిగ సంఘం నాయకుడు అంబాలరాజు అధ్యక్షతన హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో శుక్రవారం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, సదానందం మాట్లాడుతూ.. మాదిగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కరీంనగర్లోని ఏఎన్నార్ లోని కన్వెన్షన్ హాల్లో ఈ నెల 29వ తేదీన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాదిగ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు తెలిపారు.