27-06-2025 08:42:59 PM
బోథ్,(విజయక్రాంతి): రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం 9,000 కోట్లు రైతు భరోసా ను రైతులకు అందించామని, అదేవిధంగా గత 10 ఏళ్లలో ఇల్లు రాకుండా ఎంతోమంది మోసపోయారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వేల సంఖ్యల్లో నేడు ఇందిరమ్మ ఇళ్ళను ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.
రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం కింద ఆర్థిక సహాయం అందిస్తామని, ఈ పథకాలన్నీ గడపగడపకు కాంగ్రెస్ నాయకులు చేరవేర్చాలని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజుల పోతన్న, రమేష్ బత్తుల, చెట్లపెళ్లి అనిల్, పోశెట్టి, ఇస్రు పటేల్, కసిరె పోతన్న, రాము, శ్రీధర్, హరి సింగ్ , సుదీర్ , అజయ్, సత్యనారాయణ, అంకుష్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.