07-10-2025 05:59:46 PM
కరీంనగర్ (విజయక్రాంతి): వాల్మీకి మహర్షి జయంతిని మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy)తో పాటు ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదర్శమైన రామాయణం రచించిన వాల్మీకి సత్యం, ధర్మం, న్యాయం, సేవా వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారని అన్నారు. సంస్కృత సాహిత్యంలో అయన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్ఓ బి.వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఏవో సుధాకర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.