నాగర్కర్నూల్లో మహేంద్రనాథ్ శతజయంతి సన్నాహక సమావేశం
04-03-2026 12:21 AM
నాగర్ కర్నూల్ మార్చి 3 ( విజయక్రాంతి ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ హైస్కూల్లో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పుట్టపాగ మ హేంద్ర నాథ్ శతజయంతి ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. సంస్థ చీఫ్ పా ట్రన్ డా. పుట్టపాగ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై మహేంద్రనాథ్ సేవలను స్మరించారు. జూన్ 10, 2026లోగా మహేంద్రనాథ్ చౌరస్తాలో నూతన విగ్రహం స్థాపనకు నిర్ణయం తీసుకున్నారు. శతజయంతి సంచికకు హెచ్. రమేష్ బాబు చీఫ్ ఎడిటర్గా ఎంపిక కాగా, వ్యాసాలు, రచనలు సేకరించాలని తీర్మానించారు. సమావేశంలో సభ్యులు తీర్మానాలకు ఏకగ్రీవ మద్దతు తెలిపారు.




