21 April, 2026 | 4:43 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

మైసమ్మ-ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

01-04-2025 02:23 AM

మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధి లోని ప్రతాప సింగారం గ్రామం లో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో గుబ్బరి గట్టు మైసమ్మ - ఎల్లమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ మేయర్లు తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, ఘట్కేసర్ మాజీ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుంగతుర్తి రవి, కర్రె రాజేష్, శ్రీకాంత్ యాదవ్, శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.