calender_icon.png 21 November, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతన్నల రణభేరి బహిరంగ సభ జయప్రదం చేయండి

21-11-2025 06:39:59 PM

వృత్తిదారుల సంఘం మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు

చండూరు,(విజయక్రాంతి):  ఈనెల 28న తేదీన సూర్యాపేటలో జరిగే గీతన్నల రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని వృత్తిదారుల సంఘం మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోని కొండాపురం  గ్రామంలో గీత కార్మికులతో కలిసి మహాసభల పోస్టర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈనెల 28న సూర్యాపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వేలాదిగా గీత కార్మికులు తరలి రావాలని ఆయన గీత కార్మికులకు పిలుపునిచ్చారు.

బహిరంగ సభ అనంతరం 29,30 తేదీలలో జరిగే ప్రతినిధుల మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 1957లో రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడ్డ సంఘం కల్లుగీత కార్మిక సంఘమని, ఈ 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాం. సొసైటీలు, టిఎఫ్టిలు, పెన్షన్, ఎక్సిగ్రేషియా లాంటి కొన్ని హక్కులు సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపే లేదని, కేంద్ర బిజెపి ప్రభుత్వం గీత కార్మికుల  సంక్షేమానికి ఒక్క పథకం కూడా పెట్టలేదని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా వెంటనే విడుదల చేయాలన్నారు.నీరా మరియు తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తదితర  డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు.