03-06-2025 12:56:22 AM
సంగారెడ్డి, జూన్ 2(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండావిష్కరించారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్ధిక, సామజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు సీఎం ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారన్నారు.
తెలంగాణ రైజింగ్ -2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని, పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారని, ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని వివరించారు.
ఆడబిడ్డలకు అండదండలు
రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటిశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటిన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాల్లను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మహిళా సంగాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి, ఆర్టీసికి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికె అందజేయటం జరిగిందని తెలిపారు.
రైతులకు రుణవిముక్తి..
దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగిందన్నారు. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామ న్నారు.
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమచేయడం జరుగుతోందని చెప్పారు. అనంతరం పలు పథకాలను మంత్రి వివరించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో మహిళలకు 141 కోట్ల 79 లక్షల రూపాయల లబ్ది జరిగిందన్నారు. మహిళలంతా కలిసి 3 కోట్ల 15 లక్షల 95 వేలసార్లు ఉచితంగా ప్రయాణించారు.
రూ .500 కే గ్యాస్ సిలిండర్ వంటగ్యాస్ ధరల భారం నుంచి పేదలకు రక్షణ కల్పిస్తూ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన 1 లక్ష 61 వేల 967 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 13 కోట్ల 84 లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డైరెక్షన్స్ అడగండి లేదా సీఎంను మార్చుకోండి
సిద్దిపేట, జూన్ 2 (విజయక్రాంతి): అధికారం దక్కించుకునేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్ ప్లాఫ్ అయిందని బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
రేవంత్ రెడ్డికి పరిపాలించడం తెలియకపోతే మమ్మల్ని (బిఆర్ఎస్ పార్టీ) డైరెక్షన్స్ అడగండి లేదంటే కాంగ్రెస్ పార్టీ సీఎంను మార్చుకోవాలని హీతువు పలికారు. యువతకు దగ్గర అవుదామని సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో డ్రామా మొదలుపెట్టారు కానీ పరిపాలనలో గల లోపల వల్ల రాజీవ్ యువ వికాస్ పథకం వాయిదా పడిందన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మంజూరు చేశారని విమర్శించారు.
ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉండడంతో ప్రజలు ఆ పథకాన్ని తిరస్కరిస్తున్నారని చెప్పారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ఎస్ నాయకులతో పోరాటం చేయాలి కానీ ప్రజలను మోసం చేయకూడదనీ సవాల్ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెదక్, జూన్ 2(విజయ క్రాంతి): రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (ప్రజా వ్యవహారాలు) కే.కేశవరావు జాతీయ జెండాను సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆవిష్కరించారు. మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, అడిషనల్ కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పి మహేందర్, గ్రంధాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, మెదక్ ఆర్డిఓ రమాదేవి, ఇతర ప్రభుత్వ అధికారులు.
ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించు కుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో, అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని కోరుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్య పరచడంలో తమవంతు సహకారం అందిస్తున్న అధికారులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఎఫ్ జోజి, డిపిఓ యాదయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.
నారాయణఖేడ్లో..
నారాయణఖేడ్, జూన్ 2: నారాయణఖేడ్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా కొనసాగినాయి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు, స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ అశోక చక్రవర్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జగ్జీవన్, వివిధ ప్రభుత్వం కార్యాలయాలు స్థానిక చౌరస్తాల వద్ద తెలంగాణ సంబరాలను జరుపుకున్నారు.
టిఆర్ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేపట్టారు. పట్టణంలోని ఆయా పార్టీల కార్యాలయాల వద్ద ఆవిర్భావ వేడుకల్లో సందర్భంగా జెండా ఆవిష్కరణ చేపట్టారు. కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులుపాల్గొన్నారు.
సదాశివపేట పోలీస్ స్టేషన్లో అవతరణ దినోత్సవం
సదాశివపేట, జూన్ 2 : సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సీఐ మహేష్ గౌడ్, జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులను, ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు పోలీసు సిబ్బందిపాల్గొన్నారు.
కొండపూర్లో..
కొండాపూర్ జూన్ 2 :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా సోమవారం కొండాపూర్ మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయలలో తెలంగాణ తల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అశోక్, పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్త్స్ర భరత్ కుమార్ రెడ్డి,
మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మల్లేశం ఆర్.ఐ రాజు,రాంచందర్ రెవెన్యూ సిబ్బంది గ్రామాలలో మాజీ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు వార్డ్ మెంబర్లు తదితరులు జాతీయ జెండానుఎగరవేశారు.
చేగుంటలో..
చేగుంట, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ చిన్న రెడ్డి , స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ , వివిధ పార్టీ కార్యాలయాలలో మండల అధ్యక్షులు జాతీయ జెండా ఆవిష్కరించారు.
గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు , ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.
వ్యవసాయ కేంద్రంలో సంబరాలు..
తూప్రాన్, జూన్ 2: తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా వారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇందులో వైస్ ప్యాక్స్ చైర్మన్ దీపక్ రెడ్డి, డైరెక్టర్ తిరుపతి రెడ్డి, దినేష్, వ్యవసాయ కేంద్రం అధికారులు, సిబ్బందిఉన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో
తూప్రాన్, జూన్ 2 : తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
అనంతరం ప్రధాన రహదారి గుండా వివిధ శాఖల మహిళా అధికారులు, మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు కలసి జాతీయ జెండాలతో జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ఇందులో పార్టీలకతీతంగా ప్రతినిధులు, మేనేజర్ రఘువరన్, సీనియర్ అసిస్టెంట్ దుర్గయ్య, శ్రీకాంత్, ఆఫీస్ సిబ్బంది, పాల్గొని విజయవంతంచేశారు.
నార్సింగి మండలంలో..
నార్సింగి(చేగుంట), జూన్ 2 : జెండావిష్కరణ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చెలరేగడంతో రాష్ట్ర అవతరణ కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగిన సంఘటన నార్సింగి మండలం నర్సంపల్లిలో జరిగింది. మండలంలోని నర్సంపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాలు పట్టు పట్టి జెండా ఆవిష్కరణను అడ్డుకున్నారు.
గతంలో భవనంపై జెండా ఎగుర వేశామని, ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తామని బీఆర్ఎస్ పక్షంవాళ్ళు పట్టుబట్టగా, భవనం ముందు భాగంలో ఎగుర వేయాలని, భవనంపై జెండా ఆవిష్కరణ చేస్తే పెద్దలు భవనంపై వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని, లేనిపక్షంలో కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామని కాంగ్రెస్ పక్షం వారు పట్టుపట్టడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
జెండా ఆవిష్కరణ ఉదయం 8:30 గంటలకు చేయాలని అనుకున్నా వాగ్వివాదాల వల్ల 9:30 దాటినా జెండా ఆవిష్కరణ జరగలేదు. పంచాయితీ కార్యదర్శి కార్యక్రమాన్ని సజావుగా సాగించడానికి పై అధికారుల తో సంప్రదింపులు జరిపి ఇరు పక్షాలకు సముదాయించడానికి ప్రయత్నించారు. జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయురాలు పాఠశాలకు తీసుకుని వెళ్ళిపోయారు. 9:45 వరకు కూడా గ్రామంలో ఎక్కడ కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలునిర్వహించలేదు.
నాగల్ గిద్దలో..
నాగల్ గిద్ద, జూన్ 2: నాగల్ గిద్ద మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి బలరాం జెండా ఆవిష్కరించారు. స్థానిక తాహసిల్దార్ కార్యాలయంలో శివకృష్ణ. పోలీస్ స్టేషన్ లో ఎస్త్స్ర సాయిలు,మండల మహిళా సమైక్య కార్యాలయంలో మండల అధ్యక్షురాలు హిన బేగం,
మండల వనరుల కేంద్రంలో ఎంపీడీవో మహేశ్వర రావు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో డా.జువేరియా మరియు మండల సమాజీక ఆసుపత్రిలో సూపర్డెంట్ డా.అనూరాధ మరియు మండలంలోని పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలో ఆవిర్భావ వేడుకల్లో సందర్భంగా జెండా ఆవిష్కరణ ఘనంగా చేపట్టారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు , మండల నాయకులు,పాల్గొన్నారు.