calender_icon.png 9 June, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ మండల 19వ మహాసభను జయప్రదం చేయండి

09-06-2025 12:15:47 AM

ప్రజాబలంతోనే వందేళ్లు మనగలిగాం

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 8 ( విజయ క్రాంతి) ప్రజాబలం తోనే సిపిఐ పార్టీ వందేళ్ళ మనగాడ సాగించిందని, కష్టజీవుల పార్టీ గా పేరుంది అని సిపిఐ మండల కార్యదర్శి పూర్ణచందర్రావు అన్నారు. ఆదివారం మహాసభ ప్రాంగణంలో ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 10న మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో జరగనున్న సీపీఐ పాల్వంచ మండల 19వ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురు లేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందన్నారు.

నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. ఈ మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా, అతిథులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పా షా రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం,పార్టీ, ప్రజాసంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు.

మండల పరిధిలోనీ ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని మండల మహాసభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్య్ర కమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి గుండాల నాగరాజు, ఆహ్వాన సంఘం నాయకులు మన్నెం వెంకటేశ్వరరావు, ఇరుకులపటి సుధాకర్, ఆడపు పెద్ద వెంకటరామయ్య, కోటి నాగేశ్వరరావు, బుచ్చయ్య, కొత్త సురేష్, కోటి తిరుపతయ్య, బండారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.