03-07-2025 12:00:00 AM
కాపు కృష్ణ కొత్తగూడెం, జులై 2 (విజయక్రాంతి): జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె ను, జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, స్టే ట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ పిలుపు నిచ్చారు. బుధవారం జీకే ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూనియన్ల జేఏసీ సమావేశంలో,కాపు కృష్ణ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సమ్మెతో కనువిప్పు కలగాలని చెప్పారు. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా మా ర్చడాన్ని వ్యతిరేకించారు.
కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రను ఖండించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్య తిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితపు విజయ్ కుమార్ ఫిట్ సెక్రెటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.