13 March, 2026 | 7:04 PM

బాధ్యతలు స్వీకరించిన మల్లేశం

15-10-2024 12:09 AM

కరీంనగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సత్తు మల్లేశం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విజయర మణారావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరే ందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, నాయకులు, శ్రేణులు సన్మానించి అభినందించారు. సత్తు మల్లేశం మాట్లాడు తూ.. తనకు పదవీ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విజయరమణారావులకు కృతజ్ఞతలు తెలిపారు.